జ్ఞాపకాల పల్లకి

స్వాగతం

అందరకీ నమస్కారం...రండి కూర్చోండి ఇలా ఈ చెట్టు కింద కాసేపు సేద తీరుదాం...మన జ్ఞాపకాలని, బాల్యపు మధురస్మృతులని కొంతసేపు పంచుకుని వెళదాం...నా విషయానికి వస్తే ... నా జీవితాన్ని ప్రాభావితం చేసిన వారెందరో..నేను వేసే ప్రతీ అడుగులోనూ వారి జాడ కనపడుతొంది...నా ప్రతీ మాట వెనుక, కవిత వెనుక, రచన వెనుక వారి స్వరం వినిపిస్తొంది .."నేను" అని ఉన్న ప్రతీ చోట వారుంటారు ... ఇక్కడ చూస్తున్న తోటకి తోటమాలిని నేనే అయినా వీటిని నాటింది మాత్రం ఒక స్నేహితుడు (భరత్ కుమార్)...ముందే చెప్పాను గా నేనున్న ప్రతీ చోటా మరొకరి జాడ మీకు కనిపిస్తుంది....కావున మరొక్కసారి వారందరనీ తలుచుకుంటూ ..మీ అందరకీ ఆహ్వానం.

అణువణువూ అనుభవమే...!! - జే.కే వర్మ గారు


ఈయన నాకు అత్యంత స్పూర్తివంతమైన వ్యక్తులలో ఒకరు. కాకినాడలో మా ఇంటికి ఎదురు గా నివాసముంటున్నారు. నేను పుట్టినప్పటి నుంచీ ఆయన ఈ వ్యాసం రాస్తున్నప్పటి వరకూ ఒకలాగే ఉన్నారు. ఏ మాత్రం మార్పు లేదు. నేను పుట్టక ముందే ఆయన పోలీసు డిపార్టమెంట్ లో ఉద్యొగం చేసి విరమణ చేసారు. అప్పటి నుంచీ ఆ వరండాలో అలా కూర్చుని ఎవరొచ్చినా పలకరిస్తూ ఉంటారు. అతనిలో నాకు నచ్చిన విషయాలకంటే నచ్చనివే ఎక్కువ ఉంటాయి. కాని నాకు అవి అవసరం లేదు. నచ్చేవాటిలో మొదటది..ఏ పని చేసినా నికచ్చిగా చేయడం..ఇక అందులో ఏ లోటు పాట్లు లేకుండా ఏ పొరపాటుకీ తావు లేకుండా..సమయానికి కచ్చితంగా పూర్తి చేయగలగడం. ఈ వయసులో కూడా ఈయన అలానే చేస్తున్నాడు...నాకిప్పటికీ ఆస్చర్యమే అంత కచ్చితత్వ్యం ఎలా వస్తుందో ఆయనకి. 1985 లో మేముంటున్న కాలనీ ఏర్పడింది (మురళీధర్ నగర్) ..అందరూ ఇల్లులు కట్టుకోవడం 1986 కి పూర్తి చేసారు. సరిగ్గా నా వయసు మా ఇంటి వయసు ఒకటే... మా కాలనీ లో అందరం ఒక కుటుంబం లాగా ఉండేవాళ్లం..అందరం ఒకే సారి వచ్చాం కదా..ఈయనే మా కాలనీ లో అందరి ఇంటి ముందూ "కానుగ" చెట్లు నాటించారు...ఇప్పటికీ అవి అలానే ఉన్నాయి..వాటిని చూస్తున్నప్పుడల్లా ఈయన జ్ఞప్తికి వస్తారు..ఎదురింటి వైపు చూస్తానా ...ఆయన మాత్రం నిశ్చలంగా అలా నడుస్తూ పాత జ్ఞాపకాలలో సంచరిస్తూ ఉంటాడు..ఆయన దగ్గరికి వెళ్తే కనీసం 1920 నాటి కబుర్లు చెబుతారు...డచ్ వారు మన కాకినాడకి ఎలా వచ్చారు...ఏ భవనం ఎప్పుడు కట్టారు...ఏ సంవత్సరం లో ఏ ఉపద్రవం వచ్చింది...మనుషుల పోకడలు ఏ విధంగా మారాయి...అప్పట్లో జీవన విధానం ఎలా ఉండేది...అంతా "జిల్లా గ్రంధాలయంలో ఉన్న చరిత్ర పుస్తకాలన్నీ ఒకే సారి చదివినట్టుంటుంది"...ఆయన ఇప్పటికీ స్నేహితులకు ఉత్తరాలు రాస్తారు. ఆ ఉత్తరానికి ఇంకో ఖాళీ ఉత్తరం జత చేసి ఆయన చిరునామా రాసి పంపుతారు..జవాబు వారు వేరే ఉత్తరం కొనే శ్రమ లేకుండా..అది పని కచ్చితత్వం అంటే!!! నాకే స్వయంగా ఇచ్చి ఇది పోస్ట్ చేసి రా నాయనా అంటారు..కనీసం నెలలో ఒక 50 ఉత్తరాలు రాస్తుంటారు. కుటుంబం మీద కాని మనుషుల మీద కాని బంధాల మీద కాని ఆయనకి ఏ విధమైనటువంటి అనుభందమూ ప్రేమా ఆప్యాయత ఇలాంటివి లేవు..తెలిసందల్లా ఒకటే ఏ హాని చేయకుండా ఉండడం..అతనికి లోకం అంతా ఒక్కటే మనవాళ్ళని ,...పరాయి వాళ్ళని భేదం లేదు. అందరినీ ఒకలాగే చూస్తాడు. ఆయన మనవరాల ఎం. బి. బి. ఎస్ చదువుకి ఆయన ఉత్తరాల ద్వారా "డొనేషన్స్" సేకరించడం చూస్తే అద్భుతం అనిపించింది...అయిదు సంవత్సరాలు అలా చేసే ఆ అమ్మాయి చదువు పూర్తి చేయించారు. చాలా మందికి ఆయన నచ్చరు....మరి కొంత మందికి ఆయన ఆదర్శప్రాయుడు..అది చూసే జనాన్ని బట్టి ఉంటుంది..అయినా "రచ్చ గెలవాలంటే ఇంట ఓడాల్సిందే కదా!!!"

0 comments:

Post a Comment