జ్ఞాపకాల పల్లకి

స్వాగతం

అందరకీ నమస్కారం...రండి కూర్చోండి ఇలా ఈ చెట్టు కింద కాసేపు సేద తీరుదాం...మన జ్ఞాపకాలని, బాల్యపు మధురస్మృతులని కొంతసేపు పంచుకుని వెళదాం...నా విషయానికి వస్తే ... నా జీవితాన్ని ప్రాభావితం చేసిన వారెందరో..నేను వేసే ప్రతీ అడుగులోనూ వారి జాడ కనపడుతొంది...నా ప్రతీ మాట వెనుక, కవిత వెనుక, రచన వెనుక వారి స్వరం వినిపిస్తొంది .."నేను" అని ఉన్న ప్రతీ చోట వారుంటారు ... ఇక్కడ చూస్తున్న తోటకి తోటమాలిని నేనే అయినా వీటిని నాటింది మాత్రం ఒక స్నేహితుడు (భరత్ కుమార్)...ముందే చెప్పాను గా నేనున్న ప్రతీ చోటా మరొకరి జాడ మీకు కనిపిస్తుంది....కావున మరొక్కసారి వారందరనీ తలుచుకుంటూ ..మీ అందరకీ ఆహ్వానం.

ఆ పాత మధురాలు - ఆరవ తరగతిలో ఫిలాసఫి!!!


నేను ఆరవ తరగతి చదువుతున్నప్పుడు సంగతి..ఒక రోజు నేను స్కూల్ నుంచి ఇంటికొచ్చే సమయానికి మా ఇంట్లో వాళ్ళు గుడికి సిద్దమయ్యారు. ఆ రోజు మా స్కూల్ లొ ఏవో పరీక్షల తాలూకు ఫలితాలు వచ్చాయి.ఆ విషయం తెలిసి మా అమ్మగారు అడిగారు. మార్కులు ఎలా వచ్చాయిరా అని....నేను భయంతో ముందు బాగా వచ్చాయి అమ్మా అని అన్నాను. దానికి మా అమ్మ గారు అంతా దైవేచ్చ రా!! రా నువ్వు కూడా గుడికి అన్నారు. అప్పుడు కొంత కోలుకుని ఒక సబ్జెక్ట్ లో ఫైల్ అయ్యాను అన్నాను. అప్పుడు మా అమ్మ గారు కోపంతో నన్ను తిట్టడం మొదలుపెట్టారు అప్పుడు నేను కాస్త ఉక్రోషంతో ఇది కూడా దైవేచ్చే...ఏం నేను బాగా చదివితే అది దైవేచ్చ...లేకపోతే నా తప్పా? అని ప్రశ్నించా....అలా అన్నాక కోపంతో చితక్కొట్టడం మొదలు పెట్టారు....కాని ఆ తరువాతి రోజు నా సమయస్ఫూర్తిని పక్కింటివాళ్ళకి చెబుతూ మా వాడు భలే తెలివైనవాడని చెబుతుంటే నేను పక్కగా విని....భలే గర్వంగా ఫీల్ అయ్యా..ఏదో మంత్రి పదవికి ఏక్రీగవంగా ఎన్నికయినట్టు !!

0 comments:

Post a Comment