skip to main |
skip to sidebar
వీళ్ళుండేది కూడా మా కాలనీ లోనే..చిన్నప్పటి నుంచీ "ఫ్యామిలీ ఫ్రెండ్స్" ఈయన తల్లిదండ్రులూ..మా తల్లిదండ్రులూ మంచి సన్నిహితులూ....మాకు మార్గదర్శకులు (ఒక రకంగా!!). ఇతనిని శ్రీకాంత్ అని ఇంట్లొ ముద్దుగా పిలిచేవారు. నేను శ్రీకాంత అన్నయ్య అని పిలిచేవాడిని ఒకప్పుడు !! ఉండేది ఒక చోటే అయినా చాలా అరుదుగు చూసాను ఇతనిని..ఇంట్లో ఉన్నా లేనట్టే ఉండేవాడు...నేను అతి దగ్గర నుంచి చూసిన అత్యంత తెలివైన (చదువు విషయంలో) వారిలో అగ్రగన్యుడు. అతని పదవ తరగతిలో 535 మార్కులు వచ్చాయట (అప్పట్లో..1998 అనుకుంట). పాపం తక్కువ వచ్చాయని బాధపడ్డాడట !!! పేపర్లో మాత్రం ఫొటొ వచ్చింది..అప్పుడు నాకివేం తెలియవు. మనం "అమాయక చక్రవర్తి" కద అప్పుడు. అతనికి మొదటి నుంచీ "సివిల్ సర్వీసెస్" మీదే ఉండేది ద్రుష్టంతా!! కాని ముందు ఏదో ఉద్యొగం చెయ్యి. నీ కాళ్ళ మీద నువ్వు నిలుచున్నాకా నువ్వు ఇష్టం వచ్చింది చెయ్యి అని ఇంట్లో వాళ్ళు చెప్పారట. ఇష్టం లేకుండానే ఇంటర్మీడీట్ బై. పీ. సీ లో జాయిన్ అయ్యాడు ఆదిత్య జూనియర్ కాలేజీ లో ఇష్టం లేని చదువులోనే ఇంటర్ స్టేట్ 9 ర్యాంక్ వచ్చింది..అంతకు ముందు పాలిటెక్నిక్ మరియు ఏ.పి.ఆర్.జే.సీ లలో రాష్ట్ర మొదటి ర్యాంక్ వచ్చింది. తర్వాత ఎం.సెట్ మెడికల్ రాష్ట్ర స్తాయి లో 14 ర్యాంక్ వచ్చింది అప్పుడు మా కాలనీ లో చేసిన సంబరాలు అంతా ఇంతా కాదు!! అది కాదు అసలు విషయం ...ఎం.సెట్ అవ్వగానే "దేశంలోనే మెడికల్ కి సంబందించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన పరీక్ష ఏ.ఎఫ్.ఎం.సీ పరీక్షలో జాతీయ స్తాయిలో మొదటి ర్యాంక్ సంపాదించిన మొట్టమొదటి ఆంద్రుడు" అని పేపర్లో చదివినప్పుడూ..దూరదర్షన్ వార్తలలో చూసినప్పుడు...నేను పొందిన అనుభూతి చెప్పలేనిది..అదేదో నేనే పొందినట్టు ఆనందభాష్పాలు జలజలా రాలిపోయాయి. చివరికి అతను ఉస్మానియా యూనివర్శిటీలో మెడిసెన్ లో జాయిన్ అయ్యాడు...విజయవంతంగా పూర్తి చేసాడు..అప్పుడే తనకి ఇష్టమైన "సివిల్ సర్వీసెస్" మీద దృష్టి పెట్టాడు..పగలు రాత్రి అని తేడా లేదు తనకి. ఒక పక్క అత్యంత కష్టమైన ఎం.డి పరీక్షకి ప్రిపేర్ ఔతూనే దీనికీ ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. ఎం.డి జనరల్ సర్జన్ చేసాడి..అప్పటికి "సివిల్ సర్వీసెస్" లో రెండు ప్రయత్నాలలో విఫలమయ్యాడు...పరాజయమంటే ఏంటో మొదటి సారి రుచి చూపించంది. అయినా "పట్టుదల" కి ఇది గుర్తులేదు "శ్రమ" సాగుతూనే ఉంది. మూడోసారి "ప్రిలింస్" అదిగమించాడు.."మయిన్స్" ఈ సారి అతని దీక్షకి తలొగ్గింది. ఇక చివరిగా "సివిల్స్ ఇంటర్వ్యూ" దేశంలో అత్యంత ప్రామాణికమైన ఇంటర్వ్యూలలో మొదటి స్థాయి అది. అతను ఇంటర్వ్యూ కి డిల్లీ వెల్తున్న రోజు నాకు ఇంకా గుర్తుంది. "ఆల్ ది బెస్ట్ అన్నయ్యా" అన్న మాట కూడా గుర్తుంది. అతని పట్టుదల ముందు నా ఆశీస్సులనగా ఎంత!!! పూర్తి చేసి వచ్చాడు...ఎప్పటిలాగానే తను హైదరబాద్ లో హాస్పిటల్ లో ఎం.డి చేస్తున్నాడు. ఇంతలో సివిల్స్ ఫలితాలు రానే వచ్చాయి. వార్తల లో "2006 సివిల్స్ ఫలితాలు. వెలువడ్డాయి...ఎప్పటిలాగానే జాతీయ స్థాయిలో రాష్ట్ర విధ్యార్దులు తమ ప్రతిభ చాటారు. కే. రఘు రామ రెడ్డి అనే ఎం.బి.బి.ఎస్ విద్యార్ది ఈ సారి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం నిలిచి..జాతీయ స్థాయిలో 49 వ ర్యాంక్ సాదించారు. తను సాధించిన ఈ విజయానికి తన శ్రమతో పాటూ తన తల్లిదండ్రులు. శ్రేయోభిలాషుల ఆశీస్సులే గెలిపించాయని ఆయన తెలిపారు" అని వినగానే రోమాలు నిక్కపొడుచుకున్నాయి..ఏదో తెలియని ఉద్వేగం.నేనే సాధించానన్న ఆనందం. ఏదో తమ కొడుకే సాధించినంత ఆనందం మా ఇంట్లో వాళ్ళకి. డెహ్రాడున్ లో ట్రయినింగ్ పూర్తయ్యింది. అన్నవరం వెళ్దామని వారి కుటుంబం మా కుటుంబం బయలుదేరారట (నేను కేరళలో ఉన్నా అప్పుడు). వారికి నేరుగా గర్భగుడిలోనికి ప్రవేశం లభించదట. వారు భోజనాలు చేస్తున్నంత సేపూ పోలీసులు నిలబడే ఉన్నారట. ఈ విషయాలన్నీ మా అమ్మ గారు నాతో చెబుతూ "చూసావట్రా ఈ భాగ్యం ఎంత మంది తల్లిదండ్రులకు వస్తుంది చెప్పు?. నువ్వు తీసుకెళితే దర్శనం ఏ విధంగా అయ్యేదో ఒక సారి ఊహించుకో!! అన్నయ్య చెప్పినట్టు నువ్వు కూడా సివిల్స్ కి ప్రిపేర్ అవ్వరా....సాధించినా సాధించకపోయినా ప్రయత్నం చెయ్యి అది కాకపోతే ఇంకో పోస్ట్ వస్తుంది. ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది ఇంతకన్నా ఏముంటుంది చెప్పు? ఆ కధలూ కవితలూ నీకు తిండి పెట్టవు రా!!" ఒకటే చెప్పాను "ప్రతీ ఒక్కరూ సివిల్స్ సాధించగలిగితే దానికి అంత పేరు వచ్చుండేది కాదమ్మా...అది సాదించడానికి మానసికంగా చాలా ధైర్యం కావాలి. వేటి మీద దృష్టి పెట్టకూడదు. నాకా శక్తి లేదు. నా బుర్ర వేరే వాటి మీద ఉందే అర్ధం చేసుకో ఏదో ఉద్యోగం వెలగ పెడుతున్నాగా ... అందరూ కొడుకులూ ఐ. ఏ.ఎస్. లు ఐ.పి.ఎస్. లు ఐపోతే ఇంకేముంటుంది చెప్పు. గొప్పవాణ్ణవ్వాలని కోరుకోవే!! ఏ రంగమైతే ఏంటి!!. వెళ్ళు నీ గుళ్ళకేవో నువ్వు వెళ్ళి నీ మొక్కులేవొ నువ్వు మొక్కుకో..నా చేతిలో ఏం లేదు" అన్నాను. - నువ్విక మారవు రా. నే చెప్పిన మాట ఏ రోజైనా విన్నావా!!! ఇప్పుడు అతను ఏ.ఎస్.పి గా భద్రాచలంలో చేస్తున్నాడు. మొన్ననే నేను కాకినాడ వెల్తే తను వచ్చాడు. 20 ఏళ్ళగా చూసిన అన్నయ్యే...తను లోనికి వచ్చాడు "అనాలోచితంగా లేచి నిలబడ్డాను. షేక్ హ్యాండ్ ఇచాడు బాగున్నావా అని -- "బాగున్నానండి. మీరెలా ఉన్నారు?" అన్నాను అదే అన్నయ్యను. మనిషిలో మార్పు లేదు ఒక్క "స్థాయిలోనే" మార్పు. అదే నన్ను నుంచునేలా చేసింది..గౌరవించేలా చేసింది. అదీ సివిల్ సర్వీసెస్ కి ఉన్న పవర్. మొన్ననే పుస్తకాలూ అవీ తెప్పించి ప్రిపరేషన్ స్టార్ట్ చేసా. !!!!!!!!
1 comments:
andaru IAS IPS ante yela..manasuki mandu pette mee vanti "rachaitalu" chaala avasaramandi..
Post a Comment