skip to main |
skip to sidebar
నావాళ్ళంటూ నాకు ఎవరూ లేకపోయినా ఫర్వాలేదు నేను బతికేయగలను అని మొట్ట మొదటి సారిగా ఒక వ్యక్తిని చూసి అనుకున్నాను వాడే నా అత్యంత ప్రీతి పాత్రుడు బాల్య మిత్రుడు నా ఆత్మ అన్నీ వాడే....రాజన్ (పచ్చి తెలుగోడు...పేరు మాత్రం తమిళ వాళ్ళ పేరులా ఉంటుంది)
నేను మోహన్ కాన్వెంట్ లో 1996 లో ఆరవ తరగతిలో జాయిన్ అయ్యాను..అక్కడే చూసాను వాడిని మొదటి సారిగా...పొట్టిగా ఉండేవాడు..భళే చురుకుగా ఉండేవాడు...బాగా చదువుతాడు అని పేరు కూడా ఉండేది..అలాగే ఆటల్లో కూడా ఉత్సాహంగా పాల్గొనేవాడు..కాబట్టి అందరకీ అందుబాటులో ఉండేవాడు. నేను కూడా బాగా ఆకర్షితుడినయ్యాను. ఏడవ తరగతిలో మా ఇద్దరికీ బాగా పరిచయం ఏర్పడింది...నేను వాడి స్నేహం కోసం బాగా ప్రాకులాడేవాడిని..వాడు ప్రతీ విషయాన్ని చాలా తేలికగా తీసుకునే వాడు..మనుషుల గురించి ఆలోచించేవాడే కాదు...ఏదో వాడి బతుకు వాడు బతికేసేవాడు..వాడి చదువు వాడు చదివేసేవాడు...అంతే బాగా బద్దకం కూడా ..మనుషుల్ని పట్టించుకునేవాడు కాదు..అయినా అందరికీ స్నేహితుడే వాడు. బాధలు కష్టాలు ఇవేం వాడికి తెలీవు...వాడు పెరిగిన వాతావరణం అలాంటిది మరి!! నాకు వాడికి చాలా ఆంతర్యం ఉంది ఈ విషయంలో ఇలాగే మా స్నేహం కొనసాగింది ..నేనే వాడి గురించి ఎక్కువగా పట్టించుకునే వాడిని..వాడు నా గురించి అసలు ఆలోచించేవాడే కాదు. నేను చాలా బాధపడేవాడిని. చెబుదామనుకుంటే వాడు వినిపించుకునేవాడే కాదు..లోలోనే మధనపడేవాడిని. నేనే వాడిని సైకిల్ ఎక్కించుకుని తెల్లవారు జామున ప్రైవాటుకి తీసుకెళ్ళేవాడిని ..లేకపోతే వాడు రాను అనేవాడు..నాకు ఒక్కణ్ణే వెళ్ళడం ఇష్టం ఉండేది కాదు ఇలాగే కొనసాగింది ఇంటర్మీడియట్ (2003) వరకు..ఆ తరువాత నేను కాకినాడ లోనే దిగ్రీ కాలేజి లో జాయిన్ అయ్యాను..వాడు బాపట్ల ఇంజినీరింగ్ కాలేజిలో జాయి అయ్యాడు....అప్పుడు తెలిసొచ్చిందనుకుంట వాడికి మనుషులు ..లోకం అంటూ కొన్ని తెలుసుకోవాల్సినవి ఉన్నాయని...మేము ఎప్పుడు కలుసుకున్నా పార్క్ కి వెళ్ళేవాళ్ళం ఒక సారి వచ్చి..నా గురించి నీ అభిప్రాయం ఏంట్రా ..నన్ను ఒక్కొక్కరూ ఒక్కక్కలా చూస్తున్నారు ఒక్కో అభిప్రాయం చెబుతున్నారు..నా గురించి నువ్వేమనుకుంటున్నావ్ అని అడిగాడు...అదే మొట్ట మొదటి సారిగా మేము మనసు విప్పి మాట్లాడుకున్న రోజు...ఆ తర్వాత రోజు నేను ఒక ఉత్తరం రాసి వాడిని ఇంటికెళ్ళాక చదువుకొమన్నాను. వాడు దాన్ని చదివి కంటతడి పెట్టుకున్నాడు ..అప్పటి నుంచే అసలు స్నేహం మొదలైంది మా మద్య...అప్పటి వరకూ నేను వాడి భారం మోసా అప్పటి నుంచీ వాడు నా భారం మోస్తూనే ఉన్నాడు..."మరి నీ ఋనం తీర్చుకోవద్దా" అని అంటాడు..నీ ఋనం ఈ పాటికే తీరిపోయి ఉంటుంది ఇంకా లెక్క చూస్తే మళ్ళీ నేనే ఋనపడిపోయి ఉంటాను. ఇప్పుడు కూడా ఇద్దరం మద్రాసు లోనే ఉంటున్నాం. పాపం వాడే నా బాగోగులు అన్నీ చూస్తున్నాడు..ఇక్కడ పూర్తిగా నేను వాడి మీద ఆధారపడిపోయా..నా పని ఉన్నా వాడి పని ఉన్నా వాడినే పిలుస్తున్నా !! ఎప్పుడూ అనుకుంటుంటాం "ఒరేయ్ మనం ఒకే చోట ఇల్లు కట్టుకుని ఉందాం ..చక్కగా నచ్చిన వాళ్ళని పెళ్ళి చేసుకుని జీవితంలో ఏ లోటూ లేకుండా ఒకే కుటుంబంగా ఉందాం ..ఈ జన్మకి ఇలా గడిపేద్దాం" అని అనుకుంటూ ఉంటాం. రోజుకి కనీసం ఒక ఐదారు సార్లైనా ఫోన్ మాట్లాడుకుంటాం ఏం చిన్నది జరిగినా చెప్పేసుకోవాలి. నేను కవితలు, పాటలు రాయడానికి ప్రేరణ వాడే..కానీ ఏనాడు నీ రచనలు బాగున్నాయి రా అని వాడి చేత అనిపించుకోలేకపోయాను...ఏనాడైనా వాడి చేత అనిపించుకోవాలనే తాపత్రయం తోనే రాస్తున్నా....ఈ జన్మకి వీడే నా అత్యంత ప్రీతిపాత్రమైన స్నేహితుడు ..ఈ స్థానాన్ని ఎవరూ ఆక్రమించుకోలేరు!!
2 comments:
sneham ante ninnu neevu eduti vaari lo choodadam
aa snehithudi navvu lo santrupthi pondhadam
mana rajan baagunnaadu,mana entanukuntunnava
nee friend naa friend kadaa
godbless u both
aunu akkaa..nijame vaaDu mana nestame...nee renDo thammuDae anuko...maree antha manchoDu kaadule!!!! aedo vaaDiki baanisa ayipoyaa...oka "chedda alaavaaTu" naaku vaaDu. [:)]
Post a Comment